Gold-Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల నేపథ్యంలో గతవారం ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం (24 క్యారెట్స్) తులం ధర మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో రూ.1050 తగ్గి రూ.63,250 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. సోమవారం తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.64,300 పలికిన సంగతి తెలిసిందే. మరోవైపు మంగళవారం కిలో వెండి ధర సైతం రూ.1700 క్షీణించి రూ.78,500 వద్ద స్థిర పడింది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2037 డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.50 డాలర్లు పలికింది. యూఎస్ ఫెడ్ రిజర్వు వచ్చే ఏడాది వడ్డీరేట్లు తగ్గిస్తామని సంకేతాలు ఇవ్వడంతో వ్యాపారుల్లో సెంటిమెంట్ బలపడటంతో బంగారానికి గిరాకీ తగ్గిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. దేశీయంగా మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లోనూ 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.281 తగ్గి రూ.62,650 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా న్యూయార్క్లో గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.60 శాతం తగ్గి 2,054.40 డాలర్లు పలికింది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర మంగళవారం రూ.1360 తగ్గి రూ.63,820 పలికింది. సోమవారం రూ.65,180 పలికింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర సైతం సోమవారంతో పోలిస్తే రూ.59,750 నుంచి రూ.1250 తగ్గి రూ.58,500 వద్ద స్థిర పడింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.1000 పతనమై రూ.57,850 వద్ద ముగిస్తే.. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.1090 తగ్గి రూ.64,200 నుంచి రూ.63,110 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.2100 తగ్గి రూ.83,500 నుంచి రూ.81,400లకు దిగి వచ్చింది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.1000 క్షీణించి రూ.57,850లకు దిగి వచ్చింది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.1090 తగ్గి రూ.63,110 వద్ద ముగిసింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.250 తగ్గి రూ.79 వేల వద్ద పలుకుతున్నది.
మహారాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాల్లో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర రూ.1000 పతనమై రూ.57,850లకు పరిమితమైతే, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.1090 క్షీణించి రూ.63,110 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.2000 పతనమై రూ.78,500 వద్ద నిలిచింది.