న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ( Gold price ) ఇవాళ స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.6 తగ్గి రూ.46,123కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,129 వద్ద ముగిసింది. కాగా, వెండి ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.515 తగ్గి రూ.61,821కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.62,336 వద్ద ముగిసింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,811 అమెరికన్ డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 23.82 అమెరికన్ డాలర్లు పలికింది.