న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ( Gold rate ) రూ.264 పెరిగి రూ.45,123కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,859 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా పెరుగడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గడం దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.362 పెరిగి రూ.58,825కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 58,463 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,739 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.26 అమెరికన్ డాలర్లు పలికింది.