న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో ఇవాళ స్వల్ప హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ( Gold price ) కేవలం రూ.71 తగ్గి రూ.46,503కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర 46,574 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే దేశీయంగా ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇదిలావుంటే వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.263 పెరిగి రూ.64,168కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.63,905 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,826 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.78 అమెరికన్ డాలర్లు పలికింది.