న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు ( Gold rate ) ఇవాళ స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ రూ.54 తగ్గి రూ.46,448కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల బంగారం రూ.46,502 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్థిరంగా ఉండటమే ఇవాళ దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ కిలో వెండి ధర రూ.178 తగ్గి రూ.59,217కు పెరిగింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.59,395 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,794 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.28 అమెరికన్ డాలర్లు పలికింది. ఇదిలావుంటే ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్తో పోల్చితే 31 పైసలు మెరుగుపడి రూ.74.03కి చేరింది.