న్యూఢిల్లీ: ఢిల్లీలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ( Gold price ) రూ.375 తగ్గి రూ.46,411కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ ధర రూ.46,786 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు తగ్గడం, రూపాయి మారకం విలువ స్వల్పంగా మెరుగవడం దేశంలో బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.898 తగ్గి రూ.62,052కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.62,950 వద్ద ముగిసింది. ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ 22 పైసలు మెరుగుపడింది. ప్రస్తుతం అమెరికా డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 74.46 పైసలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,781 అమెరికన్ డాలర్లు, కిలో వెండి ధర 23.48 అమెరికన్ డాలర్లు పలికింది.