న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ( Gold rate ) ఒక్కరోజే ఏకంగా రూ.570 పెరిగి రూ.47,155కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,585 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువ లోహాల ధరలు పెరుగడం, ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడటం ఇవాళ దేశంలో బంగారం ధరలు పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
కాగా, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.190 పెరిగి రూ.62,145కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.61,955 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,808 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.70 అమెరికన్ డాలర్లు పలికింది. హైదరాబాద్లో మాత్రం బంగారం, వెండి ధరల్లో ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు చోటుచేసుకోలేదు. 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ ధర రూ.48,760 వద్ద, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.44,700 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.