హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ డీల్ జరిగింది. ఇప్పటి వరకు వెస్ట్ జోన్ పరిధిలోని ఐటీ కారిడార్లోనే భారీ ప్రాజెక్టులకు అధిక ప్రాధ్యానతనిచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రస్తుతం దక్షిణాదిలోనూ భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొస్తున్నాయి.
ఈ క్రమంలో ముంబైకి చెందిన గోద్రేజ్ ప్రాపర్టీస్… హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై రాజేంద్రనగర్ వద్ద సుమారు 12.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు బుధవారం ప్రకటించింది.