హైదరాబాద్, మార్చి 19: జీఎమ్మార్ హైదరాబాద్ విమానాశ్రయానికి మరో అవార్డు లభించింది. స్కైట్రాక్స్ సంస్థ నిర్వహించిన బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా-సౌత్ ఇండియా 2026 అవార్డును సొంతం చేసుకున్నది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు సంస్థ దక్కించుకోవడం ఇది ఐదోసారి కావ డం విశేషం.
ప్రపంచస్థాయి ప్రయాణికుల సేవలు అందించడం, అత్యుత్తమ ఆతిథ్యం, సమర్థత, వృత్తిపరమైన సేవలను అందించడంలో విమానాశ్రయ సిబ్బంది చూపుతున్న అంకితభావానికి ఈ అవార్డు ప్రతిఫలంగా నిలిచిందని జీఎమ్మార్ వర్గాలు వెల్లడించాయి.