హైదరాబాద్, నవంబర్ 14: జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఫ్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే గత త్రైమాసికానికిగాను రూ.546.14 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపింది. సమీక్షకాలంలో సంస్థ ఆదాయం రూ.36 లక్షల నుంచి రూ.26.34 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.27 కోట్ల నుంచి రూ.42 కోట్లకు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది.