హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): గీతం విశ్వవిద్యాలయంలో ఈనెల 24, 25 తేదీల్లో స్మార్ట్ ఐడియాథాన్ ఫిచ్ఫెస్ట్-2023ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని, ఫుడ్ అండ్ హెల్త్, టాయ్స్ ఫర్ స్టెమ్, సస్టెయినబుల్ ఫ్యాషన్, ప్రూగల్ ఇన్నోవేషన్లలో స్టార్టప్లు పాల్గొంటున్నాయని తెలిపారు.
తమిళనాడు నుంచి 206, తెలంగాణ నుంచి 103, ఏపీ నుంచి 108, కర్ణాటక నుంచి 101 దరఖాస్తులు వచ్చాయని, వీటికి సంబంధించిన తుది ఎంపిక గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ఎంపికైన స్టార్టప్లకు రూ.2 లక్షల నగదు బహుమతితో పాటు బోస్టన్లో జరిగే కార్యక్రమానికి ఎంపిక చేస్తామని, బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఐడియాకు రూ.50 వేల నగదును అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.