శంషాబాద్ రూరల్, జూన్ 11 : గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వానికి జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) తన వాటా కింద రూ.12.28 కోట్ల మధ్యంతర డివిడెండ్ను చెల్లించింది. 2025-26లో డివిడెండ్ చెల్లించడం ఇది రెండోసారి. గతంలో రూ.36.85 కోట్ల విలువైన డివిడెండ్ను చెల్లించిన విషయం తెలిసిందే.
గతేడాదికిగాను జీహెచ్ఐఏఎల్ ప్రకటించిన రూ.49.14 కోట్ల డివిడెండ్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటా కింద రూ.12.28 కోట్లు చెల్లింపులు జరుపగా, మిగతా వాటాదారులకు కూడా చెల్లించింది. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.149.87 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపినట్టు అయిందని కంపెనీ వర్గాలు వెల్లడించారు.