హైదరాబాద్ సిటీబ్యూరో/శంషాబాద్ రూరల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్కు సలాం ఎయిర్లైన్స్ నూతన సర్వీస్ను ప్రారంభించింది. ఈ నూతన సర్వీసును ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ప్రయాణికులకు విస్తృతమైన ప్రయత్నంలో కొత్త విమానయాన సంస్థకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నట్ల తెలిపారు.
హైదరాబాద్ నుంచి ఓవీ 732 నంబర్ కలిగిన విమాన సర్వీసు ఉదయం 3.55 గంటలకు బయలుదేరి 6 గంటలకు మస్కట్ చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో ఓవీ 731 నంబర్ కలిగిన విమానం మస్కట్లో రాత్రి 22.15 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 2.55 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నది. ఈ సర్వీసు ప్రతి మంగళ, బుధ,శుక్ర, ఆదివారాల్లో విమాన రాకపోకలు ఉంటాయని వివరించారు.