Gautam Singhania – Nawaz Modi | ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రేమండ్ గ్రూప్ సీఎండీ గౌతం సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ఓ సంచలన ఆడియో లీక్ బయటకు వచ్చింది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళితే తిండీ తిప్పలు, కాళ్లకు చెప్పుల్లేకుండా బలవంతంగా తిరుమల మెట్లు ఎక్కించాడని గౌతం సింఘానియాపై నవాజ్ మోదీ ఆరోపణలు చేశారు.
‘ఒకవేళ తనను పెండ్లి చేసుకోవాలంటే తిరుమలలో శ్రీవారి దర్శనానికి మెట్లపై నుంచి కాలినడకతో వెళ్లాలని షరతు విధించాడు. ఆయన మాటకు కట్టుబడి కష్టమైనా బలవంతంగానే భోజనం, తాగునీరు లేకుండానే భయపడుతూ మెట్ల మీదుగా తిరుమల కొండపైకి వెళ్లానని చెప్పారు.
‘నన్ను ఆ మెట్లు ఎక్కించేందుకు సిద్ధం చేశాడు. నాకు తిరుమల కొండపైకి వెళ్లడానికి ఎన్ని మెట్లు ఉన్నాయో తెలియదు. కానీ, తిండీ తిప్పలు లేకుండా మెట్లెక్కాను. రెండు, మూడు సార్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. నా పట్ల కేర్ తీసుకునేలా కనిపించడం లేదు. నన్ను నడిపించాలనే చూశాడు’ అని ఆ ఆడియో క్లిప్లో కనిపిస్తున్నది.
కానీ, గౌతం సింఘానియా వాదన మరోలా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తన కుటుంబ సభ్యుల గోప్యత నేపథ్యంలోనే ఆ విషయాలపై చర్చించబోను అని చెప్పారు. ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం, టీటీడీ విద్యా సంస్థల కార్యకలాపాల్లో ఆయన భాగస్వామ్యం ఉంది.