న్యూఢిల్లీ, మే 31: ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా పేరొందిన వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ లావాదేవీలపై అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ అనుమానాల్ని వ్యక్తం చేసింది.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్)..ఇతర సంస్థలతో జరిపిన మూడు లావాదేవీలపై డెలాయిట్ హాస్కిన్స్ ఆందోళనను లేవనెత్తుతూ, తమకు కంపెనీ (అదానీ పోర్ట్స్) ఇచ్చిన సమాధానం వాస్తవమా? కాదా? అనే అంశాన్ని నిర్ధారించలేమని తెలిపింది. ఆ మూడు లావాదేవీల్లో ఒకటి… హిండెన్బర్గ్ రిపోర్ట్లో పేర్కొన్న కాంట్రాక్టర్ది కావడం గమనార్హం.
అదానీ గ్రూప్ తీవ్ర ఆర్థిక తవకతవకలకు పాల్పడిందంటూ ఈ ఏడాది జనవరిలో అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదిక దేశ, విదేశాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించడం, పెను రాజకీయ దుమారాన్ని సృష్టించడం తెలిసిందే. ఆ రిపోర్ట్ విడుదలైన తర్వాత గౌతమ్ అదానీ సంపద సగానికిపైగా కరిగిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ 2022 -23 నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాల డెలాయిట్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తూ మూడు లావాదేవీల సమాచారాన్ని స్వతంత్ర పరిశీలన ద్వారా ధృవీకరించడానికి కంపెనీ తిరస్కరించిందని తెలిపింది. అందుచేత కంపెనీ స్టేట్మెంట్ను అటెస్ట్ చేయలేకపోతున్నట్టు డెలాయిట్ వివరించింది.
చట్టబద్ద లావాదేవీలేనా…
ఈ నిర్దిష్ట లావాదేవీలను ఒక స్వతంత్ర సంస్థ పరిశీలించి, ధృవపర్చనందున, హిండెన్బర్గ్ ఆరోపణలపై సెబీ దర్యాప్తు కొనసాగుతున్నందున…చట్టబద్దంగానే ఈ డీల్స్ జరిగాయా లేదా అనే అంశంపై తాను వ్యాఖ్యానించబోనని డెలాయిట్ స్పష్టం చేసింది. లావాదేవీల ధృవీకరణ జరిగిన తర్వాత సంబంధిత పార్టీలకు సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో సర్దుబాట్లు/డిస్క్లోజర్లు చేయాల్సి ఉంటుందని ఆడిటింగ్ కంపెనీ వివరించింది.
డెలాయిట్ గుర్తించిన మూడు లావాదేవీలు