హైదరాబాద్, జూలై 20: ఐటీ సేవల సంస్థ గెయిన్సైట్ హైదరాబాద్లో మరో ఆఫీస్ను తెరిచింది. దేశీయంగా, అంతర్జాతీయంగా సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్(సాస్) సేవలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన ఆఫీస్ను ఆరంభించినట్లు గెయిన్సైట్ ఇండియా ఎండీ అనిల్ చలసాని తెలిపారు.
2012లో హైదరాబాద్లో తొలి ఆఫీస్ను ఆరంభించిన సంస్థ..2015లో బెంగళూరుకు విస్తరించింది. ప్రస్తుతం సంస్థకు సిస్కో, సిట్రిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. గడిచిన రెండేండ్లలో హైదరాబాద్ ఆఫీస్లో ఉద్యోగుల సంఖ్యను 300 నుంచి 600కి పెంచుకున్నదీ సంస్థ. త్వరలో ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోనున్నట్లు అనిల్ ప్రకటించారు.