Mutual Fund Industry | హైదరాబాద్, జూలై 17: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ శరవేగంగా దూసుకుపోతున్నది. 2018లో రూ.8.11 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ ఇండస్ట్రీ జూన్ 2023 నాటికి ఐదింతలు పెరిగి రూ.44.39 లక్షల కోట్లకు చేరుకున్నట్లు యూటీఐ ఏఎంసీ సీఐవో వేత్రి సుబ్రమణియమ్ తెలిపారు. సరాసరి ఏయూఎం రూ.2.48 లక్షల కోట్లుగా ఉన్నదన్నారు. హైదరాబాద్లో ఫండ్ ఇండస్ట్రీ ఏయూఎం రూ.81 వేల కోట్లుగా ఉన్నది.