New Cars in June | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియస్గా కుటుంబ సభ్యులంతా హాయిగా ప్రయాణం చేయడానికి వీలుగా ఉన్న ఎస్యూవీ కార్లు, హ్యాచ్ బ్యాక్ సెడాన్ మోడల్ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. తదనుగుణంగా కార్ల తయారీ సంస్థలు సైతం కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఎస్యూవీ కార్లలో కొత్త ఫీచర్లు జత చేస్తున్నాయి. వచ్చే నెలలో కొత్త కార్లు మార్కెట్లో షికారు చేయనున్నాయి. వాటి గురించి తెలుసుకుందామా..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన ఫస్ట్ లైఫ్స్టైల్ ఎస్యూవీ కారు జిమ్నీ వచ్చే నెలలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇప్పటికే 30 వేలకు పైగా కార్ల కోసం ప్రీ-బుకింగ్స్ నమోదయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా థార్ మోడల్ కారుతో గట్టి పోటీ ఇవ్వనున్నదని తెలుస్తున్నది.
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లో బుల్లి ఎస్యూవీ సెగ్మెంట్లోకి ఎంటరవుతున్నది. ఇప్పటికే రూ.11 వేలు పే చేసి ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వచ్చే నెలలో దేశీయ మార్కెట్లోకి రానున్నది ఎక్స్టర్. టాటా మోటార్స్ కార్లలో పాపులరైన ఎస్యూవీ టాటా పంచ్తో ఢీ కొట్టేందుకు ఎక్స్టర్ సన్నద్ధమవుతున్నది.
జర్మనీ ఆటోమొబైల్ జెయింట్ మెర్సిడెస్-బెంజ్.. భారత్ మార్కెట్లో తన ఈవీ పోర్ట్ ఫోలియో విస్తరించాలని భావిస్తున్నది. అందుకోసం వచ్చేనెలలో తన ‘ఈక్యూఎస్’ కారును మార్కెట్లో ఆవిష్కరించనున్నది. వచ్చే ఏడాది మార్చిలోపు భారత్ మార్కెట్లోకి తీసుకు రానున్న పది కొత్త మోడల్ కార్లలో ‘ఈక్యూఎస్’ మొదటిది కానున్నది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. భారత్ మార్కెట్లో తన న్యూ ఎస్యూవీ మోడల్ కారు ‘హోండా ఎలివేట్ (Honda Elevate)` ఆవిష్కరించనున్నది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్లకు ఈ ‘హోండా ఎలివేట్’ గట్టి పోటీ ఇవ్వనున్నది. ఈ ఎస్యూవీ కారు స్మా్ల్ సన్రూఫ్, రూఫ్ రెయిల్స్, బాడీ కలర్డ్ ఓఆర్వీఎంస్ వంటి స్టయిలిష్ ఫీచర్లు కలిగి ఉంది.
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వచ్చేనెల 22న ఏఎంజీ ఎస్ఎల్ కారును ఆవిష్కరించనున్నది. సెవెన్త్ జనరేషన్ ఎఎంజీ ఎస్ఎల్ కారు 4.0 లీటర్ల వీ8 బిటర్బో ఇంజిన్ విత్ 470 హెచ్పీ, 700 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. కేవలం 3.9 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్తో దూసుకెళ్తుంది. గంటకు 315 కి.మీ వేగంతో ప్రయాణించడం ఈ కారు స్పెషాలిటీ.