హైదరాబాద్, డిసెంబర్ 14: రవాణా సదుపాయాల సంస్థ ఫ్రెష్ బస్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం 20 బస్సులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సేవలు అందిస్తున్న సంస్థ..2025 చివరినాటికి ఈ బస్సుల సంఖ్యను 170కి పెంచుకోనున్నట్టు కంపెనీ ఫౌండర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.100 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నిధులను ఇన్వెస్టర్ల నుంచి సేకరించనున్నది. ప్రస్తుతం ఒలెక్ట్రా బస్సులను లీజుకు తీసుకోని రవాణా సేవలు అందిస్తున్నది.