FPI Outflows | ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి పతనం కావడంతో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) సెంటిమెంట్ బలహీన పడింది. దీంతో ఈ నెలలో ఇప్పటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు రూ. 6,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 1.75 లక్షల కోట్ల విదేశీ పోర్ట్పోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) పెట్టుబడులు తరలి వెళ్లాయి.
ఉక్రెయిన్పై కొనసాగుతున్న రష్యా యుద్ధం, ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచే అవకాశాలు ఉన్నందున మున్ముందు కూడా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలి వెళతాయని కొటక్ సెక్యూరిటీస్ రిటైల్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అంచనా వేశారు.
డాలర్పై రూపాయి విలువ బలోపేతం అయితే తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఈక్విటీ మార్కెట్లలో షేర్లు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇదంతా అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్షపై ఆధార పడి ఉంటుందని జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జిస్ట్ వీకే విజయకుమార్ చెప్పారు. స్టాక్ మార్కెట్లలో లభించిన డేటా ప్రకారం ఈ నెల 21 వరకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ. 5,992 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.
అమెరికా ఫెడ్ రిజర్వు 75 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచడంతో సెప్టెంబర్లో రూ.7600 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. అంతకుముందు జూలైలో రూ.5000 కోట్లు, ఆగస్టులో అత్యధికంగా రూ. 51,200 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. గతేడాది అక్టోబర్ నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐల వాటాల విక్రయం మొదలైంది.