ముంబై, అక్టోబర్ 6: రిలయన్స్ రిటైల్ సంస్థ జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీని నియమితులయ్యారు. మరోవైపు ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని సంస్థ జియోఉత్సవ్ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 8న ప్రారంభంకానున్న ఈ ఆఫర్ కింద 50 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. ఎలక్ట్రానిక్స్ పరికరాలపై 70 శాతం రాయితీ ఇస్తున్న సంస్థ..స్మార్ట్ఫోన్లపై రూ.15 వేల వరకు ఎక్సేంజ్ ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది.
మరోవైపు, క్రికెట్ ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని జియో, ఎయిర్టెల్లు ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. డిస్నీ+హాట్స్టార్ కలుపుకొని పలు ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసిన జియో..ఎయిర్టెల్ రెండు ప్లాన్లు ప్రవేశపెట్టింది. రూ.99కే రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ డాటాతోపాటు రూ.49కే రోజుకు 6జీబీ డాటా ను ఆఫర్ చేస్తున్నది. జియో మాత్రం నెల, త్రైమాసికపు, వార్షిక ప్లాన్లలో డాటా, అన్లిమిటెడ్ వాయిస్, డిస్నీ+హాట్స్టార్ మొబైల్ను అందిస్తున్నది.