న్యూఢిల్లీ, మే 30: దేశంలో తయారీ రం గాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్ విఫలమవుతున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ దేశీ తయారీ ఉత్పత్తులకు సబ్సిడీ ఇస్తు న్న ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ సమర్థతను ప్రశ్ని స్తూ రాజన్ సోషల్ మీడియాలో ఒక రీసెర్చ్ నోట్ను పోస్ట్ చేశారు. ఈ సబ్సిడీలతో మొబైల్ ఫోన్ల తయారీ జరగడం లేదని, దిగుమతి అయిన విడిభాగాల అసెంబ్లింగ్ మాత్రమే చేస్తున్నారని వివరించారు. దేశంలో తయారీ సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన ఉద్దేశ్యంగా వివిధ రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల పీఎల్ఐ స్కీమ్లను కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ స్కీమ్ల అమలుతీరును వివరిస్తూ రాజన్తో పాటు మరో ఇరువురు ఆర్థికవేత్తలు రాహుల్ చౌహాన్, రోహిత్ లంబాలు ఈ రీసెర్చ్ నోట్ను రూపొందించారు.