Force Tractors | న్యూఢిల్లీ, మార్చి 29: ట్రాక్టర్ల వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ఫోర్స్ మోటర్ ప్రకటించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే వ్యవసాయ ట్రాక్టర్లు, కనెక్టెడ్ యాక్టివిటీ వ్యాపారాల నుంచి వైదొలిగే విషయాన్ని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. మొబిలిటీ ట్రాన్స్పోర్టేషన్, లాస్ట్-మైల్ మొబిలిటీ, సరుకు రవాణా, ప్రీమియం లగ్జరీ ఓఈఎం విడిభాగాలపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీకి వ్యవసాయ ట్రాక్టర్లను విక్రయించడంతో రూ.182.53 కోట్ల ఆదాయం సమకూరింది.