న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్.. వార్షిక సేల్ను ప్రకటించింది. బుధవారం నుంచి 23 వరకు గృహోపకరణాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫాన్లను తక్కువ ధరకే విక్రయిస్తుంది.
ఆరోసారి ప్రకటించిన ఈ ఆఫర్లపై నో-కాస్ట్ ఈఎంఐ, డౌన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఈఎంఐ చెల్లింపులు జరుపుకోవచ్చు. రూ.9,990 నుంచి రూ.2 లక్షల మధ్య రిఫ్రిజిరేటర్లు, రూ.25వేలు-రూ.65వేల మధ్య ఏసీ లు, రూ.1,299-రూ.15వేలలోపు సీలింగ్ ఫ్యాన్లను విక్రయిస్తున్నది.