న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫాంపై డిసెంబర్ 9 నుంచి 16 వరకూ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ను (Flipkart Year End sale) ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కలిగిన వారు ఒక రోజు ముందుగానే ఈ డీల్స్ను అందుకోవచ్చు. సేల్కు ముందు ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్లో అందుబాటులో ఉండే కొన్ని డీల్స్ను ఈ-కామర్స్ దిగ్గజం షేర్ చేసింది.
ఐఫోన్ 14. నథింగ్ ఫోన్ (2). పిక్సెల్ 7, మోటీ జీ54 5జీ, రియల్మీ సీ53, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ, పోకో ఎం6 ప్రో 5జీ, మొటొరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, వివో టీ2 ప్రో, ఐఫోన్ 14 ప్లస్ వంటి పలు హాట్ డివైజ్లు సేల్లో భాగంగా డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంటాయి. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్22 రూ. 40,000లోపు లభిస్తుందని ప్లాట్ఫాం టీజర్లో వెల్లడైంది. ఇదే శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ప్రస్తుతం రూ. 49,999కి లభిస్తుండటంతో ఈ హాట్ డివైజ్ను ఫ్లిప్కార్ట్ సేల్లో ఆకర్షణీయ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈ ఏడాది శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్పై ఏమైనా డీల్స్ ఉంటాయా అనేది ఇంకా వెల్లడికాలేదు. ఇక ఐఫోన్ 14పై ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేస్తారనే వివరాలు కూడా వెల్లడికాలేదు. న్యూ ఐఫోన్ 15 మోడల్పై డీల్స్కు సంబంధించిన వివరాలు కూడా ఇంకా ఈ-కామర్స్ దిగ్గజం వెల్లడించలేదు. ఇక స్మార్ట్ఫోన్లతో పాటు టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలపై 75 శాతం వరకూ డిస్కౌంట్స్ను ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక ల్యాప్టాప్స్పై రూ. 9990 నుంచి డీల్స్ ప్రారంభమవుతాయని ఫ్లిప్కార్ట్ తెలిపింది.
Read More :