న్యూఢిల్లీ : పండగ సీజన్కు ముందు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్ను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ను ప్రారంభించనుంది. సేల్ డేట్ను ఈ కామర్స్ దిగ్గజం అధికారికంగా వెల్లడించనప్పటికీ తన న్యూ బడ్జెట్ ఫోన్ ప్రమోషన్లో భాగంగా స్మార్ట్ఫోన్ బ్రాండ్ పోకో తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం పేర్కొంది. మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను ప్రకటించింది.
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై పది శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నారు. సేల్లో భాగంగా కస్టమర్లు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై ఏకంగా 80 శాతం వరకూ డిస్కౌంట్ పొందవచ్చని ఈకామర్స్ దిగ్గజం పేర్కొంది. స్మార్ట్ఫోన్లతో పాటు హెడ్ఫోన్లు, వైర్లెస్ ఇయర్ఫోన్లపైనా భారీ డిస్కౌంట్ ఆఫర్లో ఉంది. ఫ్లిప్కార్ట్ సేల్లో న్యూ పోకో ఎం5 స్మార్ట్ఫోన్ రూ 10,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుందని పోకో వెల్లడించింది.
ఇక ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్లో ఐఫోన్ 12, ఐఫోన్ 13లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. ఇక అమెజాన్ మొబైల్స్, యాక్సెసరీస్పై 40 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లు, ట్యాబ్లెట్లు, ఇయర్ ఫోన్లపై 70 శాతం వరకూ ఆఫర్ ఉంటుందని తెలిపింది. టీవీలు, అప్లయన్స్లపై 60 శాతం వరకూ తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఎస్బీఐ బ్యాంకు కార్డులపై కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించింది.