హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారత్ నుంచి పలు దేశాలకు విమాన సర్వీసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి 11 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అబుదాబీ, బహ్రెయిన్, దమ్మం, దోహా, దుబాయ్, కువైట్, మాల్దీవులు, షార్జా, సింగపూర్, లండన్కు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 6న లండన్ నుంచి బ్రిటిష్ ఏయిర్వేస్ విమానం హైదరాబాద్కు వచ్చి, బుధవారం తిరిగి వెళ్లింది. ఇకపై గురు, శుక్ర, శని, ఆదివారాల్లో లండన్కు విమాన సర్వీసులు నడవనున్నాయి. భారత్తోపాటు ఇతర దేశాల్లో కొవిడ్-19 ఉద్ధృతి తగ్గడంతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సైతం ఆసక్తి చూపుతున్నారు.