న్యూఢిల్లీ, మే 19: రియాద్ నుంచి హైదరాబాద్ నగరాల మధ్య రోజువారి విమాన సర్వీసులను జూలై 1 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఇందుకోసం 186 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఏ320 నియో ఎయిర్క్రాఫ్ట్ను వినియోగిస్తున్నట్టు కంపెనీ సీఈవో సంజీవ్ కపూర్ తెలిపారు. రియాద్ సందర్శించేవారు పెరుగుతుండటంతో ఈ నూతన సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, త్వరలో మరో సర్వీసును ప్రారంభించబోతున్నట్టు ఆయన ప్రకటించారు.