హైదరాబాద్, జూలై 1: ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా ప్లాంట్లలో అమెరికా నియంత్రణ మండలి తనిఖీలు పూర్తి అయ్యాయి. హైదరాబాద్లోని జీడిమెట్ల ప్లాంట్ను జూన్ 19 నుంచి 23 వరకు, వైజాగ్ యూనిట్ను జూన్ 26 నుంచి 30 వరకు తనిఖీలు నిర్వహించిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్డీఏ).. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ తెలిపారు.