Gold Price | న్యూఢిల్లీ, జూలై 28: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతోపాటు ఫెడ్ వడ్డీరేట్లను పెంచడంతో ధరలు భారీగా పడిపోతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.350 తగ్గి రూ.60,250 పలికింది. అంతకుముందు ఈ ధర రూ.60, 600గా ఉన్నది.
పసిడితోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,900 తగ్గి రూ.76 వేలుగా నమోదైంది. హైదరాబాద్లో కిలో వెండి ఏకంగా రూ.2 వేలు దిగి రూ. 79,500గా నమోదైంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 380 దిగి రూ.60,110కి, 22 క్యారెట్ల ధర రూ.350 తగ్గి రూ.55,100గా ఉన్న ది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,951 డాలర్లకు, వెండి 24 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.