Paytm CEO | ఫ్యాషన్ డిజైన్ సంస్థ నైకా.. ఫిన్టెక్ పేమెంట్స్ బ్యాంక్ పేటీఎం.. ఈ రెండు సంస్థలు గతేడాది చివరిల్లో దాదాపు ఒకేసారి ఐపీవోకు వెళ్లాయి. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి ముందు పేటీఎం వెలుగు వెలిగింది. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. నైకా సీఈవో కం ఫౌండర్ ఫాల్గుణి నాయర్ నికర సంపద.. పేటీఎం ఫౌండర్ కం సీఈవో విజయ్శేఖర్ శర్మను దాటేసింది. విజయ్శేఖర్ శర్మ సంపద కంటే ఫాల్గుణి నాయర్ నికర సంపద నాలుగు రెట్లు ఎక్కువ.
నైకా తన లిస్టింగ్ తొలి రోజు ఇన్వెస్టర్ల మనీ డబుల్ చేసుకుంటే, పేటీఎం ఇష్యూ ధర రూ.2150కి చేరుకోవడానికి ఆపసోపాలు పడింది. నైకా ఇష్యూ ధర రూ.1,125 అయితే, లిస్టెడ్ ఇష్యూ ధర రూ.2,001గా నమోదైంది. ప్రస్తుతం నైకా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,690 కోట్లు (9.2 బిలియన్ల డాలర్లు. లిస్టింగ్ ధర కంటే తక్కువే అయినా ఇష్యూ ధర 7.4 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువే.
మరోవైపు పేటీఎం లిస్టింగ్ డే నాడు 9 శాతం డిస్కౌంట్తో మొదలై.. క్రమంగా పడిపోయింది. 2021 వరకు స్టార్టప్ సంస్థగా పేటీఎం మార్కెట్ వాల్యూ 16 బిలియన్ డాలర్లతో అత్యధిక విలువ కంపెనీగా నిలిచింది. ఇప్పుడు ఈ స్థానాన్ని బైజూ`స్ ఆక్రమించేసింది. లిస్టెడ్ అయినప్పటి నుంచి పేటీఎం విలువ సుమారు 75 శాతం నష్టపోయింది. 19.9 బిలియన్ల డాలర్ల నిధులు సేకరించాలని పేటీఎం ఐపీవోకు వెళ్లింది. కానీ ప్రస్తుతం పేటీఎం ఎం-క్యాప్ రూ.41,476 కోట్లు (5.4 బిలియన్ల డాలర్లు)
అంతే కాదు.. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో విజయ్ శేఖర్ శర్మ ర్యాంక్ పడిపోయింది. గతేడాది వ్యక్తిగత నికర సంపద 2.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే 1362వ బిలియనీర్గా నిలిచారు. ఇప్పుడు కేవలం 1.1 బిలియన్ల డాలర్లతో 2387వ ర్యాంక్తో సరిపెట్టుకున్నారు.