న్యూఢిల్లీ, జూలై 24:ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అమితావ్ ముఖర్జీ పదవి కాలాన్ని ఈ ఏడాది నవంబర్ 19 వరకు పొడిగించింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 19 వరకు కేంద్రం పొడిగించింది. ప్రస్తుతం ఎన్ఎండీసీ డైరెక్టర్(ఫైనాన్స్)గా విధులు నిర్వహిస్తున్న ముఖర్జీకి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా పదొన్నతి లభించింది.