Budget 2022 | దేశ జనాభాలో మూడోవంతు ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. వచ్చే ఎనిమిదేండ్లలో అది 50 శాతానికి చేరుతుందని అంచనా. పట్టణీకరణ పెరుగుతున్నా కొద్దీ న్యూక్లియర్ ఫ్యామిలీస్వైపు మళ్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతున్నది. ఇండ్ల రుణాలు తీసుకునే వారి మనోగతంలో మార్పులకు యువతే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. యువ జనాభాలో 66 శాతం 35 ఏండ్లలోపు వారే. మిలియనియల్ రుణ గ్రహీతల్లో యువతరం కూడా ఉన్నారు. 26-35 ఏండ్ల లోపు వారు సుమారు 25 శాతం, 36-45 ఏండ్ల మధ్య వయస్కులు 28 శాతం మంది ఇంటి రుణాలు తీసుకుంటున్నారు. ఐదేండ్లుగా రుణాలపై ఇండ్లు కొనుగోలు చేస్తున్న యువతరం (సీఏజీఆర్ 6.2 శాతం) శాతం క్రమంగా పెరుగుతున్నది. ఇండ్ల కొనుగోళ్లు.. రుణ పరిమాణం పెరిగినా.. లోన్ల వడ్డీపై పన్ను రాయితీ మాత్రం రూ.2లక్షలకే పరిమితమైంది. దీంతో ఆ పరిమితి పెంచాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.
పురుషుల కంటే ఇంటి రుణాలు తీసుకుంటున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నది. ప్రత్యేకించి నాలుగైదేండ్లుగా రూ.15-35 లక్షల ధరతో చౌకగా లభించే ఇండ్ల రుణాలు పెరుగుతున్నాయి. క్రమంగా ఇండ్ల కొనుగోలుదారులు అధిక ధరతోపాటు విలాసవంతమైన, సౌకర్యవంతమైన ఇండ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐదేండ్లుగా మిడ్ రేంజ్, ఉన్నత స్థాయి ఇండ్లకు డిమాండ్ పెరుగుతున్నది. రూ.35-75 లక్షల విలువ గల ఇండ్ల కొనుగోళ్లు గత ఐదేండ్లుగా నాలుగు శాతం పెరిగాయి. రూ.75 లక్షల పై చిలుకు ఇండ్లకు కూడా గిరాకీ ఉంది. ఐదేండ్లుగా రూ.75 లక్షల పై చిలుకు ఇండ్ల గిరాకీ 0.37 నుంచి 0.87 శాతానికి పెరిగింది. మరోవైపు రూ.15 లక్షల్లోపు ఇండ్ల కొనుగోళ్లకు డిమాండ్ పడిపోతున్నది.
హోంలోన్లు, రియల్ ఎస్టేట్ ప్లాట్ల కొనుగోళ్లలో వేతన జీవుల రోజువారీ ఖర్చులు కూడా కీలకమవుతున్నాయి. వేతన జీవులు తీసుకునే ఇండ్ల రుణాలపై ఈఎంఐ (నెలవారీ వాయిదా)లు కీలకం కానున్నాయి. రియల్ ఎస్టేట్లో రంగంలో రేట్లు పెరుగుతుండటం.. ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుండటంతో ఇండ్ల కొనుగోలుదారులు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. మరో ఆసక్తికర అంశమేమిటంటే హోం-లోన్ టెన్యూర్ కూడా 11-30 ఏండ్ల మధ్య ఫ్లక్చువేట్ అవుతున్నది.
రుణాలిస్తున్న ఆర్థిక సంస్థలు, బ్యాంకులు తొలి దశలోనే ఈఎంఐలు, ప్రిన్సిపల్ అమౌంట్ కాంపొనెంట్లో 50 శాతానికి పైగా వసూలు చేసుకోవడంతో ఈఎంఐలు సపోర్టివ్గా ఉండట్లేదు. నెలవారీ వాయిదాలు దగ్గర పడుతున్నా కొద్ది వడ్డీ చెల్లింపు తగ్గుతూ.. ప్రిన్సిపల్ అమౌంట్ పెరుగుతుంది. ఇల్లు కొనుగోలుదారు హోంలోన్ ప్రీ-పేమెంట్ చేస్తే వడ్డీ ఆదా చేయడానికి బదులు భారీ మొత్తంలో ప్రిన్సిపల్ అమౌంట్ (అసలు) చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు లోన్స్ ప్రీ-క్లోజర్పై ఆర్థిక సంస్థలు, బ్యాంకులు భారీ లెవీ ఫీజు వసూలు చేస్తున్నాయి.
ఇంటి కొనుగోలుదారు హయ్యర్ టెన్యూన్ లోన్ రీ పేమెంట్ ఆప్షన్ను ఎంచుకుంటే.. రెండో ప్రాపర్టీపై ఇన్వెస్ట్ చేయడం ఆ వ్యక్తికి కస్టం అవుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ (అసలు), వడ్డీ ముందస్తుగా ఖరారవుతున్నప్పుడు లోన్ టెన్యూర్ అంతా ఈఎంఐల్లో సమాన మొత్తం ఎందుకు ఉండదని పలువురు తరుచుగా ప్రశ్నిస్తున్నారు.
ఇక ఆదాయం పన్ను మినహాయింపు విషయానికి వస్తే.. ఇంటి రుణంలో చెల్లిస్తున్న ప్రిన్సిపల్ అమౌంట్ (అసలు) మొత్తం.. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద డిడక్షన్కు అవకాశం ఉంది. ఏటా గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పరిమితి ఉంది. ఇదే 80సీ సెక్షన్ కింద పీఎఫ్, పీపీఎఫ్, జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లింపులకు ఐటీ రిటర్న్స్ క్లయిమ్ చేయొచ్చు. కానీ ఇదే సెక్షన్ కింద ఇతర బెనిఫిట్ పొందడానికి అవకాశం లేదు. గత కొన్నేండ్లుగా ఇండ్ల రుణాలపై పన్ను మినహాయింపు పరిమితి పెంచలేదు.
ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు సమర్పిస్తారు. ఇండ్ల రుణాలపై వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లిమిట్ పెంచాలని బయ్యర్లు కోరుతున్నారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని అభ్యర్థిస్తున్నారు.
ప్రతిఏటా ఇంటి రుణంపై చెల్లిస్తున్న వడ్డీ మీద ఆదాయం పన్ను చట్టంలోని 20 (బీ) సెక్షన్ కింద రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. భారీ మొత్తంలో ఇండ్ల రుణాలు తీసుకున్న వారు మరికొంత బెనిఫిట్ పొందడానికి మాత్రం ఈ సెక్షన్ అనుమతించట్లేదు. ఇంటి రుణాలపై పన్ను మినహాయింపులు పొందడానికి ఐటీ చట్టంలో 80ఈఈ, 80ఈఈఏ వంటి కొన్ని సబ్ సెక్షన్లను కేంద్రం చేర్చింది.
ఇంటి రుణ పరిమాణాన్ని బట్టి అదనపు బెనిఫిట్ పొందడానికి ఈ సబ్ సెక్షన్లు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో యూనియన్ బడ్జెట్-2022లో ఇన్కం టాక్స్ శ్లాబ్లైన 80సీ, 80ఈఈ, 80ఈఈఏ, 24 (బీ) సెక్షన్ల కింద ఇండ్ల కొనుగోలుదారులకు అదనపు బెనిఫిట్లు కల్పించేలా, రాయితీలిచ్చేలా మార్పులు తేవాలని కోరుతున్నారు.