ముంబై, జూన్ 22: ఈవీల తయారీ సంస్థ ఈవీట్రిక్ మోటర్స్ తన తొలి మోటర్సైకిల్ను దేశీయ మార్కెట్లోకి పరిచయం చేసింది. ఈ బైకు ధర రూ.1.60 లక్షలుగా నిర్ణయించింది. రూ.5 వేలు ముందస్తుగా చెల్లించి ఈ మోటర్సైకిల్ను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ సూచించింది.
గంటకు 70 కిలోమీటర్లు ప్రయాణించే ఈ బైకు సింగిల్ చార్జీంగ్తో 110 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. పుణెకు చెందిన ఆటోమేషన్ సంస్థ పీఏపీఎల్ సబ్సిడరీ సంస్థే ఈవీట్రిక్ మోటర్స్. 2000 వాట్ల బీఎల్డీసీ మోటర్ కలిగిన ఈ బైకులో 70వీ/40ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ, నాలుగు గంటల్లో పూర్తిస్థాయి బ్యాటరీ చార్జింగ్కానున్నది.