న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లకు డిమాండ్ పెరగడంతో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన బ్రాండ్ జాయ్ ఈ-బైక్ అక్టోబర్లో 2855 యూనిట్ల స్కూటర్లు, ఈ బైక్లను విక్రయించామని వార్డ్విజార్డ్ ఇన్నోవేషన్స్ మొబిలిటీ లిమిటెడ్ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే అమ్మకాలు ఐదు రెట్లు అధికమని కంపెనీ తెలిపింది.
పండగ సీజన్లో తమకు అదనపు ఆర్డర్లు వస్తున్నాయని నవంబర్ తొలివారంలో రిటైల్ సేల్స్ మరింత ఊపందుకుంటాయని ఆశిస్తున్నామని కంపెనీ సీఎండీ యతిన్ గుప్తే పేర్కొన్నారు. ధంతేరస్, దీపావళి సందర్భంగా బంపర్ సేల్స్పై కంపెనీ అంచనాలు ఊపందుకున్నాయి.