న్యూఢిల్లీ, జూన్ 10: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లోకి పెట్టుబడులు పోటెత్తాయి. గత నెల మేలో రికార్డు స్థాయిలో రూ.34,697 కోట్లు వచ్చాయి. అంతకుముందు నెల ఏప్రిల్లో రూ.18,917 కోట్లుగానే ఉన్నాయి. కాగా, స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులున్నా.. ఈక్విటీ ఎంఎఫ్ల్లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఈక్విటీ ఫండ్స్ల్లోకి పెట్టుబడులు రావడం వరుసగా ఇది 39వ నెల అని భారతీయ ఎంఎఫ్ల సంఘం (యాంఫీ) తెలిపింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు నాటికి మొత్తం మ్యూచువల్ ఫండ్ సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ఆస్తులు రూ.57.26 లక్షల కోట్లుగా ఉంటే.. మే నెలలో రూ.58.91 లక్షల కోట్లకు చేరాయి.
సిప్లలో పెట్టుబడులు మదుపరులను ఆకట్టుకుంటున్నాయి. మే నెలలో రూ.20,904 కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్లో రూ.20,371 కోట్లుగా ఉండగా.. వరుసగా రెండో నెలా రూ.20వేల మార్కును దాటినైట్టెంది. ‘ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ల్లో నికర పెట్టుబడులు మే నెలలో రూ.25.39 లక్షల కోట్లకు చేరాయి’ అని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని తెలిపారు. ఇదిలావుంటే డెట్ కేటగిరీ స్కీముల్లో మే నెల నికర పెట్టుబడులు రూ. 42,495 కోట్లుగా ఉన్నా యి. అయితే ఏప్రిల్తో పోల్చితే దాదాపు 78 శాతం పడిపోయాయి.