హైదరాబాద్, అక్టోబర్ 7: బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో రిటైల్ అవుట్లెట్లు నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఐపీవోకు అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 71.93 రెట్ల అధిక బిడ్లు దాఖలయ్యాయి. 6.25 కోట్ల షేర్ల జారీ చేయగా..దీనికి 449.53 కోట్ల షేర్ల బిడ్డింగ్ దాఖలయ్యాయని తెలిపింది.
క్యాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల నుంచి 169 రెట్లు అధిక బిడ్లు రాగా, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 63 రెట్లు, రిటైల్ ఇండివిజల్ ఇన్వెస్టర్ల నుంచి 19 రెట్ల అధిక బిడ్లు దాఖలయ్యాయని తెలిపింది.