న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. స్టీల్ ఆథార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) నుంచి రూ.1,200-1,500 కోట్ల విలువైన విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టు లభించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య నేడు అధికారిక ఒప్పందం జరిగింది. బర్నపూర్లో సెయిల్ సంయుక్తంగా 4.08 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్లోనే ఈ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ ప్రాజెక్టు వచ్చే 39 నెలల్లో అందుబాటులోకి రానున్నది.