ముంబై, డిసెంబర్ 11: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కినెటిక్ గ్రీన్.. దేశీయ మార్కెట్కు సరికొత్త స్కూటర్ను పరిచయం చేసింది. ఫేమ్-2 నిబంధనలకు లోబడి తయారు చేసిన ఈ ‘జూలు’ మాడల్ అత్యంత వేగంగా ప్రయాణించనున్నది. దీని ప్రారంభ ధర రూ. 94,990గా నిర్ణయించింది.
ఈ ధరలు ముంబై షోరూంనకు సబంధించినవి. అత్యంత వేగవంతంగా చార్జింగ్ అయ్యే బ్యాటరీతో రూపొందించిన ఈ స్కూటర్ లిథియం-అయాన్ బ్యాటరీ, ఆయిల్-కూల్డ్ టెక్నాలజీతో రూపొందించినట్టు కంపెనీ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ తెలిపారు. సింగిల్ చార్జింగ్తో 104 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది.