హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): విమానాశ్రయ మెట్రో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగ్రోడ్డు వెంబడి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలి వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గంలో భూమిని చదును చేయడం, రైట్ ఆఫ్ వే కోసం ఫెన్సింగ్ పనులు చేపడుతున్నారు.
ఇందుకోసం సుమారు రూ.6.96 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఇప్పటికే మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎంపిక చివరిదశలో ఉండటంతో ఈ లోపు 31 కిలోమీటర్ల మార్గం లో రైట్ ఆఫ్ వే స్పష్టంగా ఉండేలా క్షేత్రస్థాయిలో అవసరమైన పనులను అధికారులు వేగవంతం చేశారు.
ఎయిర్పోర్టు మెట్రో మార్గంలో..