ముంబై, ఫిబ్రవరి 22: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్ను బయటకు పంపేందుకు కంపెనీ షేర్హోల్డర్లు ఓటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కంపెనీ యాజమాన్యమైన రవీంద్రనాథ్, ఆయన కుటుంబాన్ని తొలగించేందుకు కొంతమంది ఇన్వెస్టర్లు డిమాండ్ చేసిన అత్యవసర సర్వసభ్య సమావేశం (ఈజీఎం)శుక్రవారం ఫిబ్రవరి 23న జరగనుంది. ఉన్నత యాజమాన్యం తొలగింపునకు ఈజీఎంలో తీర్మానాన్ని ఆమోదిస్తారు. అయితే ఈజీఎంలో ఆమోదించిన ఎటువంటి తీర్మానాన్ని అయినా తదుపరి విచారణలోగా అమలు చేయరాదని కర్నాటక హైకోర్టు ఆదేశించినందున, మార్చి 13 వరకూ ఈ తీర్మానం అమలుకాదు. ఈజీఎంపై స్టే విధించాలని బైజూస్ హైకోర్టును ఆశ్రయించగా, అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. రవీంద్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులకు బైజూస్ ప్రమోటింగ్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్లో 26.3 శాతం వాటా ఉంది. 32 శాతంపైగా వాటా ఉన్న కొన్ని ఇన్వెస్టింగ్ సంస్థలు ఈజీఎం కోసం పట్టుపట్టాయి. ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్బర్గ్ సతీమణి చాన్ జుకర్బర్గ్తో సహా బ్లాక్రాక్తో సహా పలు అంతర్జాతీయ ఈక్విటీ ఫండ్స్కు థింక్ అండ్ లెర్న్లో వాటాలు ఉన్నాయి.