న్యూఢిల్లీ, జనవరి 8: మేక్మైట్రిప్ గ్రూప్నకు చెందిన సంస్థ బుక్మైఫారెక్స్.. విదేశీ విద్య కోసం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇది ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కలిసిరానున్నది. ప్రస్తుతం ట్యూషన్ ఫీజులు, వసతి సదుపాయాలకు డిపాజిట్లు, రోజువారీ ఖర్చుల కోసం నగదు పంపిస్తే చేరేందుకు రోజుల సమయం పడుతున్నది. అయితే ప్రముఖ బ్యాంకులతోపాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆథరైజ్డ్ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్న బుక్మైఫారెక్స్..
నగదు పంపిన రోజునే విద్యార్థులకు చేరేలా బదిలీ ప్రక్రియను పూర్తి చేయనున్నది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. దీనివల్ల విశ్వవిద్యాలయాల్లో చెల్లింపుల ఆలస్యానికిగాను ఎదురయ్యే జరిమానాలు తప్పుతాయని చెప్తున్నది. కాగా, అంతర్జాతీయ విద్యా సంబంధిత నగదు బదిలీలపై రూ.15,000 వరకు ఇస్తున్న క్యాష్బ్యాక్ ప్రయోజనాలనూ బుక్మైఫారెక్స్ పొడిగించడం విశేషం.