హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్..దసరా పండుగ సందర్భంగా ‘గ్రేట్ ఫెస్టివల్ డేస్’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ కంటే రూ.5 వేల వరకు తగ్గింపు ధరతో ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్నట్టు కంపెనీ సీఎండీ వై గురు తెలిపారు. సరికొత్త స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన వారికి పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. వీటిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈజీ ఈఎంఐపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్, ఐసీఐసీఐ ఫైనాన్స్పై రూ.10 వేల వరకు క్యాష్బ్యాక్, బజాజ్ ఫిన్సర్వ్పై రూ.9 వేల వరకు క్యాష్బ్యాక్, ఎస్బీఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులపై 5 శాతం తక్షణ క్యాష్బ్యాక్ వంటి రాయితీలు కూడా పొందవచ్చునని తెలిపింది.
అలాగే రూ.6,999కే ఎల్ఈడీ టీవీ, ఎల్ఈడీ టీవీ ధరకే క్యూలెడ్ టీవీ, ఎల్ఈడీ టీవీ-సౌండ్ బార్పై ప్రత్యేక కాంబో ఆఫర్, బ్రాండెడ్ స్మార్ట్వాచ్ రూ.999 నుంచి, ఇయర్బడ్స్ రూ.799 నుంచి, ల్యాప్టాప్ కొనుగోలుపై రూ.3,999 విలువైన ల్యాప్టాప్ కిట్ ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే మిషన్ ఈ-వేస్ట్లో భాగంగా ఇంట్లో పనిచేయని పాత ఎలక్ట్రానిక్ పరికరాలు సెలెక్ట్ స్టోర్లలో ఉన్న ఈ-వేస్ట్ బాక్స్లో వేయడంతో రూ.10 వేల వరకు డిస్కౌంట్ను పొందవచ్చునని తెలిపింది.