న్యూఢిల్లీ : చాట్జీపీటీ రాకతో ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్పై (AI chatbot) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ టూల్స్తో ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన నేపధ్యంలో పలు కంపెనీలు చాట్జీపీటీతో ఇప్పటికే ఉద్యోగులను రీప్లేస్ చేయగా లేటెస్ట్గా బెంగళూర్కు చెందిన స్టార్టప్ దుకాణ్ కొలువుల కోతకు తెగబడింది.
దుకాణ్ తన సపోర్ట్ టీంలో ఏకంగా 90 శాతం మందిని తొలగించి వారి స్ధానంలో ఏఐ చాట్బాట్ సేవలను వినియోగిస్తోంది. ఏఐతో పెద్దసంఖ్యలో సపోర్ట్ స్టాఫ్ను రీప్లేస్ చేశామని దుకాణ్ వ్యవస్ధాపకుడు సుమిత్ షా ప్రకటించారు. ఈ స్టార్టప్ 2022 సెప్టెంబర్లో ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు లేఆఫ్స్కు తెగబడింది. కంపెనీ ఏఐ చాట్బాట్ కస్టమర్ సపోర్ట్ వ్యయాలను 85 శాతం తగ్గించడంతో పాటు సమస్యలను చక్కదిద్దే సమయాన్ని కూడా ఆదా చేస్తోంది.
ఏఐతో ఉద్యోగులను సాగనంపాలనేది తన అభిమతం కాదని, కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఏఐ టెక్నాలజీని సమర్ధంగా వినియోగించుకోవాలనేదే తమ ఉద్దేశమని షా వివరించారు. సమయం, ఖర్చును ఆదా చేసేలా ఇది కంపెనీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని ఆయన సమర్ధించుకున్నారు. సపోర్ట్ స్టాప్ ఓ కస్టమర్ సంబంధిత ఇష్యూను పరిష్కరించేందుకు 2 గంటల 13 నిమిషాల సమయం తీసుకుంటే ఏఐ చాట్బాట్తో కేవలం 4 నిమిషాల్లోపే పరిష్కరించడం సాధ్యమవుతున్నదని షా పేర్కొన్నారు.
Read More :