న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు చేస్తున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఓ విడిభాగానికి సంబంధించి హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమెన్క్లచర్ (హెచ్ఎస్ఎన్) కోడ్ తప్పిదంపై డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ విచారణ చేస్తున్నట్టు రెగ్యులేటరీకి బుధవారం మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. కాగా, దీనికి సమాధానం ఇస్తున్నామని, ఈ దర్యాప్తు వల్ల సంస్థకు ఆర్థికంగా, కార్యకలాపాలపరంగా, మరే రకంగా కూడా ఎటువంటి ప్రభావం ఉండబోదని మారుతీ చెప్పింది.