న్యూఢిల్లీ, ఆగస్టు 2: చైనాకు చెందిన ఆటో రంగ దిగ్గజం బీవైడీ.. పన్ను ఎగవేత ఆరోపణల్ని ఎదుర్కొంటున్నది. రూ.73 కోట్ల పన్ను చెల్లించలేదంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు చేస్తున్నది. చైనా నుంచి విడిభాగాలు భారత్లోకి దిగుమతి చేసుకుని, ఇక్కడ వాటిని అసెంబ్లింగ్ చేస్తూ మార్కెట్లో బీవైడీ కార్లను అమ్ముకుంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆ దిగుమతైన కార్ల విడిభాగాలకు పన్నులు చెల్లించలేదని డీఆర్ఐ చెప్తున్నది. అయితే డీఆర్ఐ ప్రాథమిక దర్యాప్తు అనంతరం బీవైడీ సదరు మొత్తాన్ని డిపాజిట్ చేసిందంటున్నారు. అయినప్పటికీ అదనపు పన్ను చార్జీలు, జరిమానా కోసం నోటీసులను ఇచ్చేందుకు డీఆర్ఐ సిద్ధమవుతున్నట్టు సమాచారం.