న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ యూఎస్ఎఫ్డీఏ.. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్కు తెలంగాణలోని బాచుపల్లి ప్లాంటు తనిఖీలో కనుగొన్న లోపాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అమెరికాకు జరిపే ఔషధ ఎగుమతుల్లో ఈ ప్లాంట్ డాక్టర్ రెడ్డీస్కు కీలకమైనది. ఇందులో 100కుపైగా ఉత్పత్తులు తయారవుతాయి.
యూఎస్ నుంచి ఆదాయంలో 30 శాతం ఇక్కడిదే. అభ్యంతరాలు తీవ్రమైనవి అయినందున తదుపరి కంపెనీకి ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్ జారీచేయవచ్చన్న అంచనాల్ని బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేయడంతో సోమవారం డాక్టర్ రెడ్డీస్ షేరు ఇంట్రాడేలో 7 శాతం మేర పతనమయ్యింది. చివరకు 5 శాతం నష్టంతో రూ. 5,473 వద్ద నిలిచింది.