ముంబై, ఏప్రిల్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతంమేర లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 582.87 పాయింట్లు అధికమై నాలుగు వారాల గరిష్ఠ స్థాయి 59,689.31ని తాకింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 159 పాయింట్లు అందుకొని 17,557.05 కి ఎగబాకింది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 2,075 పాయింట్లు(3.5 శాతం), నిఫ్టీ 605 పాయింట్లు(4 శాతం) చొప్పున పెరిగాయి. బుధవారం సూచీల్లో ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ఫార్మా, ఐటీసీ, హెచ్యూఎల్, టైటాన్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.