దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదొడుకుల నడుమ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 669.14 పాయింట్లు పెరిగి 85,231.92 వద్ద, నిఫ్టీ 158.10 పాయింట్లు అందుకుని 26,06 8.15 దగ్గర స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ వారం సూచీలు ఒకింత ఊగిసలాటకే గురికావచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికాతో వాణి జ్య ఒప్పందం ప్రభావితం చేస్తున్నది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి పెట్టుబడులపట్ల నిర్ణయాలు తీసుకోవడమే ఉత్తమం. ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, ఇతర అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యమే. సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తే నిఫ్టీకి 25,700 పాయింట్ల స్థాయి కీలకం. దిగువన ముగిస్తే 25,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చు. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 26,300-26,500 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.