SBI | న్యూఢిల్లీ, మార్చి 16: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ని సవరించింది. ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చేలా బీపీఎల్ఆర్ని 15 శాతానికి పెంచింది. కానీ, మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని యథాతథంగా ఉంచింది. బేస్ రేటుని 10.25 శాతంగా కొనసాగించింది.
ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతంగా ఉంచిన బ్యాంక్ నెల ఎంసీఎల్ఆర్ని 8.20 శాతంగాను, మూడు నెలల రేటును 8.2 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ని 8.55 శాతంగా ఉంచింది. రుణ గ్రహీతలు అత్యధికంగా తీసుకునే ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై రేటును 8.65 శాతంగా నిర్ణయించింది. అలాగే రెండేండ్ల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటును 8.75 శాతంగాను, మూడేండ్ల కాలపరిమితిపై 8.85 శాతానికి సవరించింది. ఈబీఎల్ఆర్ మారలేదు.